ఒకప్పటి సహచరునికి కాల్.. మోదీ పలకరింపుతో షాక్

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అప్పుడప్పుడూ ఆయన చేసే పనులు పలువురిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆదివారం జరిగింది.

ఒకప్పటి సహచరునికి కాల్.. మోదీ పలకరింపుతో షాక్
Follow us

|

Updated on: Apr 26, 2020 | 8:14 PM

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అప్పుడప్పుడూ ఆయన చేసే పనులు పలువురిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆదివారం జరిగింది. మోదీ బీజేపీలో పనిచేసే తొలినాళ్లలో తనకు సహచరుడిగా పనిచేసిన ఓ తెలుగు వ్యక్తికి ఆయన ఆదివారం స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్యంపై వాకబు చేయడం ప్రస్తుతం పతాక శీర్షికల కెక్కింది.

అనంతపురం జిల్లాకు చెందిన 86 ఏళ్ల బిజెపి సీనియర్ నేతకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఫోన్ ఆదివారం ఫోన్ వచ్చింది. తాళంకి కృష్ణమూర్తి అనే సీనియర్ బీజేపీ నేతకు నేరుగా ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఒకరకంగా ఒకనాటి సహచరునికి షాక్ ఇచ్చారు. 86 ఏళ్లు నిండిన కృష్ణమూర్తి ఆరోగ్య క్షేమాల గురించి ప్రధాని మోదీ వాకబు చేశారు.

తాళంకి కృష్ణమూర్తితో కలిసి బీజేపీలో పనిచేసిన రోజులను ప్రధానమంత్రి స్వయంగా గుర్తు చేసుకున్నారు. కృష్ణమూర్తితో మాట్లాడిన తర్వాత ఆయన సతీమణి, కుమారులతోనూ మోదీ మాట్లాడారు. కృష్ణమూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ఊహించని ఫోన్ కాల్ తో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు తాళంకి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు.

ప్రస్తుత సమయంలో దేశానికి శ్రీకృష్ణ పరమాత్ముడిలా.. మీరు ఉన్నారని మోడీకి తెలిపిన తాళంకి కృష్ణమూర్తి. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత క్లిష్ట సమయంలో మీరు లేకుంటే దేశం ఏమైపోయి ఉండేదోనని తాళంకి కృష్ణమూర్తి.. ప్రధాని మోదీతో వ్యాఖ్యానించారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు మోదీ తనతో ముచ్చటించిన విషయాన్ని అత్యంత సంతోషంతో పంచుకున్నారు కృష్ణమూర్తి.