టీడీపీ ఎంపీల విలీనం రాజ్యాంగబద్ధమే: కిషన్రెడ్డి
ఇటీవల టీడీపీ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వదిలి బీజేపీలో చేరిన సంగతి విదితమే. ఈ అంశమై హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీన ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగిందని ఆయన అన్నారు. టీడీపీ విలీన ప్రక్రియను కొందరు అనవసరంగా విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం […]
ఇటీవల టీడీపీ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వదిలి బీజేపీలో చేరిన సంగతి విదితమే. ఈ అంశమై హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీన ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగిందని ఆయన అన్నారు. టీడీపీ విలీన ప్రక్రియను కొందరు అనవసరంగా విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, గరికపాటి మోహన్రావు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారన్నారు. ఆ నలుగురు సభ్యులు రాజ్యసభ ఛైర్మన్కు విలీన లేఖ ఇచ్చారని కిషన్రెడ్డి గుర్తు చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని చెప్పారు. ఏ సభలోనైనా మూడో వంతు సభ్యులు విలీనం చేయాలని కోరితే అది చట్టవిరుద్ధం కాదన్నారు.