ఏపీలో మరో రెండుసార్లు ఉచిత రేషన్..
దేశవ్యాప్త లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పేద వర్గాల ప్రజలు ఎటువంటి ఆకలి బాధలు పడకుండా ప్రతి తెల్ల రేషన్ కార్డుకూ గవర్నమెంట్ ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును ఆదివారం (మార్చి 29న) పంపిణీ చేయనుంది. ఇదే విధంగా మరోసారి రెండుసార్లు…( ఏప్రిల్ 15న ఓసారి, ఏప్రిల్ 29న) కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని లబ్దిదారులకు కూడా ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించారు. […]
దేశవ్యాప్త లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పేద వర్గాల ప్రజలు ఎటువంటి ఆకలి బాధలు పడకుండా ప్రతి తెల్ల రేషన్ కార్డుకూ గవర్నమెంట్ ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును ఆదివారం (మార్చి 29న) పంపిణీ చేయనుంది. ఇదే విధంగా మరోసారి రెండుసార్లు…( ఏప్రిల్ 15న ఓసారి, ఏప్రిల్ 29న) కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని లబ్దిదారులకు కూడా ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించారు.
దీనితో పాటు ఏప్రిల్ 4న ప్రతి కార్డుదారుడికీ రూ.1000 ఆర్థిక సాయాన్ని కూడా అందించనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈసారి బయోమెట్రిక్ విధానం ఉపయోగించకుండా గవర్నమెంట్.. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలకు సూచనలు జారీ చేసింది.