ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్

కొంతకాలంగా ఏజెన్సీల్లో అలజడి కొనసాగుతోంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ములుగు జిల్లా మంగపేట అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య..

ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్
Chhattisgarh Naxal Encounterc
Follow us

|

Updated on: Oct 18, 2020 | 6:58 PM

Encounter : కొంతకాలంగా ఏజెన్సీల్లో అలజడి కొనసాగుతోంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ములుగు జిల్లా మంగపేట అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.

రామచంద్రునిపేట అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను ఇటీవల టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వరావును హతమార్చిన మావోయిస్టులుగా గుర్తించారు. కాగా, ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘూతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును ప్రేస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు గస్తీ పెంచారు. ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ముసలమ్మగుట్ట అటవీప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా కూంబింగ్ నిర్వహిస్తూనే ఉంటారని ములుగు ఎస్పీ తెలిపారు.