తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. భేటీలో డీఎంకే నేతలు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అంతకముందు ఇవాళ ఉదయం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని కేసీఆర్ దర్శించుకున్నారు. ఫెడరల్ ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్.. ఇటీవలే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే.