బండికి స్ట్రాంగ్ కౌంటర్.. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే కేంద్రం ఏం చేస్తుంది? : వినోద్

జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..

బండికి స్ట్రాంగ్ కౌంటర్.. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే కేంద్రం ఏం చేస్తుంది? : వినోద్
Follow us

|

Updated on: Nov 25, 2020 | 1:27 PM

జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తాము జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని, దీనికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని కూడా వ్యాఖ్యానించిన విషయం విధితమే. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు సహా కాంగ్రెస్, టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు తెలంగాణ ప్రభుత్వానికి, రోహింగ్యాలకు సంబంధం ఏంటని బీజేపీ నేతలను ఆయన నిలదీశారు.

ఇతర దేశస్తులు మన దేశంలో ఎక్కడ ఉన్నా వారిని గుర్తించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని, ఆ విషయం పార్లమెంట్ సభ్యుడైన సంజయ్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఎంపీ బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది.. ఏది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందనే విషయం కూడా తెలియకపోవడం దారుణం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోహింగ్యాలు ఉన్నారని, వారిని గుర్తించే పని ఆయా దేశాలపై ఉంటుందని పేర్కొన్న వినోద్.. ఒకవేళ హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే కేంద్ర భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మీరు చేసిన వ్యాఖ్యల ఆధారంగా రా, ఇంటెలిజెన్స్ సంస్థలు విఫలం అయ్యాయని ఒప్పుకున్నట్లేనా? అని రాష్ట్ర బీజేపీ నేతలను ఆయన నిలదీశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విఫలం అయ్యారని అంగీకరించినట్లేనా? అని అన్నారు. రోహింగ్యాల అంశంపై పార్లమెంట్‌లో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను బీజేపీ ఎంపీలు మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు కొరివితో తమ తల తామే గోక్కుంటున్నారని, రోహింగ్యాల అంశం బీజేపీ మెడకు చుట్టుకుందని వినోద్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉందని, ఆ ప్రశాంతతను చెడగొట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీజేపీ నేతలను ఆయన హెచ్చరించారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు