బీటెక్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులరే.!

కరోనా వైరస్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు కావడంతో.. ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనలియర్ ఎగ్జామ్స్‌పై అయోమయం నెలకొంది.

బీటెక్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులరే.!
Follow us

|

Updated on: Jun 12, 2020 | 12:57 PM

కరోనా వైరస్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు కావడంతో.. ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనలియర్ ఎగ్జామ్స్‌పై అయోమయం నెలకొంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతోన్న పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈ పరీక్షలను కూడా వాయిదా వేసే అవకాశం ఉందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జేఎన్టీయూ అధికారులు మాత్రం గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచే సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెబుతున్నారు. అటు ఈ పరీక్షలకు హాజరు కాలేనివారు సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులర్‌గానే గుర్తించాలని ప్రాధమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జేఎన్టీయూహెచ్ లెటర్ రాసింది.

మిగిలిన స్టూడెంట్లకు జూలై 16 నుంచి…

రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ పరిధిలో 270 వరకూ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలున్నాయి. ఎంహెచ్ఆర్డీ, ఉన్నత విద్యామండలి సూచనలకు అనుగుణంగా ఈ నెల 20 నుంచి బీటెక్, బీఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ విద్యార్ధులకు జూలై 16 నుంచి, సప్లిమెంటరీ పరీక్షలను ఆగష్టు 3 నుంచి నిర్వహించాలని యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, కరోనా భయం, రవాణా సమస్య కారణంగా పరీక్షలకు హాజరు కాలేని విద్యార్ధులు.. ఆగష్టులో జరిగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాసైతే వారిని రెగ్యులర్‌గానే గుర్తించాలని వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా వర్సిటీ వీసీ జయేష్ రంజన్ ప్రభుత్వానికి పంపించారని.. ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Also Read:

గుడ్ న్యూస్.. ఇకపై మూడు రోజుల్లోనే పెన్షన్ విత్ డ్రా..

మహిళల కోసం మరో సంక్షేమ పధకం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

నేడే ఏపీలో ఇంటర్ ఫలితాలు.. చూసుకోండిలా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు