లోన్ అనౌన్స్మెంట్… ఎంఎస్ఎమ్ఈలకు రుణాలు అందించేందుకు సుముఖంగా ఉన్నాం… ఎస్బీఐ చైర్మన్…
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలుస్తామని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ అన్నారు. గ్లోబల్ అలయెన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రిన్యూర్ వెబ్నార్లో మాట్లాడారు.
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలుస్తామని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ అన్నారు. గ్లోబల్ అలయెన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రిన్యూర్ వెబ్నార్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆత్మ నిర్భర్ ప్యాకేజీని పారిశ్రామిక వేత్తలకు అందించేందుకు నూతన విధానాన్ని అవలంభిస్తామని ప్రకటించారు. భారతీయ ఆర్థిక చోధక శక్తిలో కీలకమైనవి ఎమ్ఎస్ఎమ్ఈలేనని తెలిపారు.
రుణాలు నిల్వలపై కాకుండా…
ఎంఎస్ఎంఈలకు రుణాలను ఆయా సంస్థల బ్యాంకు నిల్వలపై కాకుండా సంస్థలు జరిపే నగదు కార్యాకలాపాల ఆధారంగా ఇస్తామని స్పష్టం చేశారు. ఆర్బీఐ సహకారం, సూచనలను అనుసరించి రుణ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. అయితే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రుణాలను అందించడం కొద్దిగా కష్టతరం అని అన్నారు. అయితే ఆర్బీఐ, కేంద్రం సహకారంతో సాధ్యమైన మేర రుణ పరపతిని ఎంఎస్ఎంఈలకు అందించేందుకు ఎస్బీఐ కృషి చేస్తుందని అన్నారు.