హెరిటేజ్ మాది కాదంటున్నా నమ్మరేః భువనేశ్వరి
ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉల్లి ధరలపై చర్చ వాడీవేడిగా సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. హెరిటేజ్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. కిలో రూ.200కి విక్రయిస్తున్నారని సీఎం జగన్, వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె దానికి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరైన భువనేశ్వరి జగన్ చేసిన విమర్శలను ఖండించారు. […]
ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉల్లి ధరలపై చర్చ వాడీవేడిగా సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. హెరిటేజ్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. కిలో రూ.200కి విక్రయిస్తున్నారని సీఎం జగన్, వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె దానికి కౌంటర్ ఇచ్చారు.
తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరైన భువనేశ్వరి జగన్ చేసిన విమర్శలను ఖండించారు. ఆ సంస్థ తమ అధీనంలో లేదని ఫ్యూచర్ గ్రూప్ కింద ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా పెరుగుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు.
కిలో ఉల్లి రూ.150 నుంచి 200 మధ్య అమ్ముతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అంతేకాకుండా తన జీవితంలో ఉల్లి ధరలు ఇంతలా పెరిగిపోవడం ఎప్పుడూ చూడలేదన్న భువనేశ్వరి సత్వర పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీలో ఉల్లి విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఆ తరుణంలో చంద్రబాబు జగన్కు ఓ సవాల్ విసిరారు. తమ అధీనంలో హెరిటేజ్ లేదని.. అది గానీ నిరూపిస్తే.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని జగన్కు సవాల్ విసిరారు.