పేర్ని నానిపై హత్యాయత్నం.. మంత్రిపై తాపీతో దాడి చేసిన ఆగంతకుడు.. షాకైన పోలీసు యంత్రాంగం

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం చేశారు దుండగుడు.  మచిలీపట్నంలో ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీతో దాడి చేశాడు.

పేర్ని నానిపై హత్యాయత్నం.. మంత్రిపై తాపీతో దాడి చేసిన ఆగంతకుడు.. షాకైన పోలీసు యంత్రాంగం
Follow us

|

Updated on: Nov 29, 2020 | 12:17 PM

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం చేశారు దుండగుడు.  మచిలీపట్నంలో ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీతో దాడి చేశాడు. మంత్రి నాని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు..పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది.

అయితే దుండగుడు మద్యం మత్తులోనే పేర్ని నానిపై హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు చెమ్మన్నగిరి పేటకు చెందిన బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. హత్యాయత్నంపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నాగేశ్వరరావుకు నేర చరిత్రపై ఏమైనా ఉందా, లేదా ఎవరైనా ఉసిగొల్పి పంపించారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.  నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అనుచరుల డిమాండ్ చేస్తున్నారు.

అమిత్ షా హైదరాబాద్ పర్యటన లైవ్ అప్డేట్స్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :