India Vs Australia 2020: పాయింట్ల పట్టికలో పైనే… అయితే విజయాల్లో రెండో స్థానంలో భారత్…
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడంతో భారత్కు 30 పాయింట్లు వచ్చాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడంతో భారత్కు 30 పాయింట్లు వచ్చాయి. దీంతో మొత్తం 390 పాయింట్లతో భారత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ, విజయాల పరంగా చూస్తే … భారత్ రెండో స్థానంలోనే నిలిచింది. భారత్ 0.722 శాతంతో ఉండగా ఆసీస్ 0.766 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఐసీసీ అందిస్తున్న పాయింట్లు…
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ను ఇస్తోంది. రానున్న టెస్టు ఛాంపియన్ షిప్ నేపథ్యంలో ఐసీసీ ప్రతి టెస్టు సిరీసుకు 120 పాయింట్లు ఇస్తోంది. మ్యాచ్లను బట్టి ఒక్కో మ్యాచ్ పాయింట్లను డిసైడ్ చేస్తారు. గెలిస్తే మొత్తం పాయింట్లు, డ్రా చేస్తే సగం పాయింట్లు లభిస్తాయి. మొన్నటి వరకు పాయింట్ల పరంగానే జట్ల స్థానాలను లెక్కించిన ఐసీసీ హఠాత్తుగా విజయాల శాతం ప్రవేశపెట్టింది. దాంతో గెలుపు శాతం అధికంగా ఉన్న ఆసీస్ అగ్రస్థానంలోకి చేరగా భారత్ ద్వితీయ స్థానంలోకి వచ్చింది. అయితే… బోర్డర్ గావస్కర్ ట్రోఫీని గెలుచుకుంటే టీమ్ఇండియా మళ్లీ నంబర్ వన్ అయ్యే అవకాశముంది.