బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ గ్యాస్ పైప్లైన్ పేలిపోయింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్ రాజధాని వెలుపల నారాయణగంజ్లోని బైతుస్ సలాత్ జామే మసీదు వద్ద సాయంత్రం ప్రార్థనల సందర్భంగా భూగర్భ గ్యాస్ పైప్లైన్ పేలినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి మసీదులోని ఆరు ఏసీలు కూడా పేలిపోయాయి. ఈ పేలుళ్లలో 37 మంది ముస్లింలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చికిత్స పొందుతూ 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తుండగా పేలుళ్లు సంభవించాయి. ప్రమాదస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.
An underground gas pipeline near a mosque exploded during evening prayers outside the capital of Bangladesh, leaving at least 11 worshipers dead#Bangladesh #MosqueBlast https://t.co/UwZUfyWpKu
— Deccan Chronicle (@DeccanChronicle) September 5, 2020