ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌కి షాక్‌.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..

| Edited By:

Jul 31, 2020 | 10:56 AM

ఇటీవ‌ల కాలంలో సెల‌బ్రిటీల ఫోన్ల‌ను, ట్విట్ట‌ర్ల‌ను హ్య‌క్ చేస్తూ.. సైబ‌ర్ నేర‌గాళ్లు అనేక మోసాల‌కు పాల్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ సింగ‌ర్ సునీత పేరుతో కూడా ఓ వ్య‌క్తి మోసాల‌కు పాల్పడిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె ఇటీవ‌లే సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌కి షాక్‌.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..
Follow us on

ఇటీవ‌ల కాలంలో సెల‌బ్రిటీల ఫోన్ల‌ను, ట్విట్ట‌ర్ల‌ను హ్య‌క్ చేస్తూ.. సైబ‌ర్ నేర‌గాళ్లు అనేక మోసాల‌కు పాల్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ సింగ‌ర్ సునీత పేరుతో కూడా ఓ వ్య‌క్తి మోసాల‌కు పాల్పడిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె ఇటీవ‌లే సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌లు విష‌యం బ‌య‌ట పెట్ట‌డంతో పాటు పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ విష‌యం పూర్తిగా మ‌రచిపోక‌ముందే.. ఇప్పుడు తాజాగా ప్రముఖ సినీ నటుడు, ఎస్ ఎం కే పార్టీ అధినేత, ప్ర‌ముఖ న‌టి రాధిక భ‌ర్త‌ శరత్ కుమార్‌కి షాక్ ఇచ్చారు మొబైల్ హ్యాక‌ర్స్‌. గత కొంతకాలంగా నటుడు శరత్ కుమార్ ఫోన్ నెంబర్‌తో పలువురు ప్రముఖులకు హ్య‌క‌ర్స్‌ ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. శరత్ కుమార్ వాయిస్‌లోనే మాట్లాడుతూ పలువురిని బెదిరిస్తూ, డ‌బ్బులు డిమాండ్ చేసిన‌ హ్య‌క‌ర్స్‌.

శరత్ కుమార్ ఫోన్‌కి ఆయన నెంబర్ నుండే ఫోన్ కాల్ రావడంతో పాటు ఆయ‌నలా మాట్లాడ‌టంతో అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫోన్ కాల్స్ కి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ, తన ఫోన్‌ని హాక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు న‌టుడు శ‌ర‌త్ కుమార్.

Read More:

క‌రోనా పంజా.. ప్ర‌పంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు