BREAKING NEWS : ఆదిలాబాద్ జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జైత్రమ్ తండాలో సర్పంచ్-మాజీ సర్పంచ్ భర్తకు మధ్య వివాదం చెలరేగింది.  మాజీ సర్పంచ్ భర్త గజానంద్ వర్గంలో..

BREAKING NEWS : ఆదిలాబాద్ జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ

Updated on: Jul 28, 2020 | 7:20 AM

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జైత్రమ్ తండాలో సర్పంచ్-మాజీ సర్పంచ్ భర్తకు మధ్య వివాదం చెలరేగింది. గొడవ చినికి చినికి పెద్ద గొడవగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన తాండవాసులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో మాజీ సర్పంచ్ భర్త గజానంద్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆగ్రహంతో సర్పంచ్ వర్గానికి చెందిన మూడు ఇళ్లను మాజీ సర్పంచ్ వర్గీయులు తగులబెట్టారు.

అయితే ఈ ఘర్షణల మధ్యే ఆయన చనిపోయారాని ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. జైత్రమ్ తాండకు అదనపు పోలీస్ బలగాలను పంపించినట్లుగా ఎస్పీ తెలిపారు. గొడవకు కారణమైన పలువురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఈ ఘటనలో మూడు ఇళ్లతోపాటు ఒక కారు, నాలుగు బైక్ లను తగలబెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us