ఢిల్లీలో కరోనా వైరస్ పై పోరు, అందుబాటులోకి 750 ఐసీయూ బెడ్స్, రెండు రోజుల్లోనే, కేంద్రం చొరవ

ఢిల్లీలో కరోనా వైరస్ పై పోరును ప్రభుత్వం తో బాటు కేంద్రం కూడా నడుం బిగించింది.పెరిగిపోతున్న  కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు, వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టడం ప్రారంభించాయి,.

ఢిల్లీలో కరోనా వైరస్ పై పోరు, అందుబాటులోకి 750 ఐసీయూ బెడ్స్, రెండు రోజుల్లోనే, కేంద్రం చొరవ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 18, 2020 | 6:21 PM

ఢిల్లీలో కరోనా వైరస్ పై పోరును ప్రభుత్వం తో బాటు కేంద్రం కూడా నడుం బిగించింది.పెరిగిపోతున్న  కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు, వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టడం ప్రారంభించాయి,. ఇందులో భాగంగా 750 ఐ సీ యూ పడకలతో విశాలమైన హాస్పిటల్ కమ్ కేర్ సెంటర్ ఏర్పాటైంది. 45 మంది డాక్టర్లు, 160 మంది పారామెడికల్ సిబ్బంది హస్తిన చేరుకున్నారు. మరో 30 మంది వైద్యులు, 90 మంది పారామెడికల్ ఉద్యోగులు త్వరలో ఇక్కడికి రానున్నారు. బెంగుళూరు నుంచి 250 వెంటిలేటర్లను భారత్ ఎలెక్ట్రానిక్స్ సంస్థ ఢిల్లీ నగరానికి పంపింది. మంగళవారం ఒక్కరోజే 20 వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ నెల 16 న హోం మంత్రి అమిత్ షా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ నార్త్ బ్లాక్ లో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కేంద్రం హుటాహుటిన ఈ చర్యలు తీసుకుంది. ఈ నెలాఖరుకు లక్ష నుంచి లక్షా 20 వేల టెస్టులు నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఇవి 60 వేల టెస్టులు మాత్రమే !