జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి పట్ల చిరంజీవి సంతాపం

|

Sep 08, 2020 | 12:10 PM

సీనియ‌ర్ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు అని వెల్లడించారు. చివ‌రిగా ఆయ‌న‌తో ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో క‌లిసి న‌టించాను.

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి పట్ల చిరంజీవి సంతాపం
Follow us on

సీనియ‌ర్ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు అని వెల్లడించారు. చివ‌రిగా ఆయ‌న‌తో ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో క‌లిసి న‌టించాను. ఆయ‌న గొప్ప న‌టుడు. నాట‌క రంగం న‌న్ను క‌న్న త‌ల్లి, సినిమా రంగం న‌న్ను పెంచిన త‌ల్లి అనేవారు. అందుకే ఇప్ప‌టికి శ‌ని, ఆదివారాల‌లో షూటింగ్‌లు పెట్టుకోనండి, స్టేజ్‌పై ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తుంటాను. మీరు ఎప్పుడైన రావాలి అని అడిగేవారు. ఆ అవ‌కాశాన్ని నేను పొంద‌లేక‌పోయాను అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సినిమాల‌లో రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్ట్ అంటే మొద‌టు గుర్తుకు వ‌చ్చేది జ‌య‌ప్రకాశ్ రెడ్డి గారే. త‌నకంటూ ప్ర‌త్యేక ట్రెండ్ సెట్ చేసుకున్నారు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని చిరు ట్వీట్ చేశారు.