హేమంత్ హత్య కేసు విచారణలో అవంతి ఏం చెప్పిందంటే..

|

Sep 29, 2020 | 5:14 PM

చందానగర్ పరువు హత్య కేసులో హేమంత్ భార్య అవంతి విచారణ ముగిసింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అవంతి , హేమంత్ కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ లను పోలీసులు రికార్డ్ చేశారు. ఉదయం 11 గంటల నుండి ముగ్గురి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు.. వీరిని మొత్తంగా ఆరు గంటల పాటు విచారించారు. హేమంత్ హత్య కు ముందు.. హత్య తరువాత జరిగిన పరిణామాలపై స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్ చేశారు. అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు. […]

హేమంత్ హత్య కేసు విచారణలో అవంతి ఏం చెప్పిందంటే..
Follow us on

చందానగర్ పరువు హత్య కేసులో హేమంత్ భార్య అవంతి విచారణ ముగిసింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అవంతి , హేమంత్ కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ లను పోలీసులు రికార్డ్ చేశారు. ఉదయం 11 గంటల నుండి ముగ్గురి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు.. వీరిని మొత్తంగా ఆరు గంటల పాటు విచారించారు. హేమంత్ హత్య కు ముందు.. హత్య తరువాత జరిగిన పరిణామాలపై స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్ చేశారు. అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు. నిందితులకు బెయిల్ రాకుండా పోరాటం చేస్తానని ప్రకటించారు. నా భర్త హేమంత్ హత్య కేసు పై ఉదయం నుండి పోలీసులు విచారణ చేసి , స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఆమె చెప్పారు. ‘పోలీస్‌లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను.. నాకు ఉన్న అనుమానాలను పోలీస్‌ల దృష్టికి తీసుకెళ్లాను’ అని ఆమె వెల్లడించారు.

ప్రాణహాని ఉందని పోలీస్ లకు తెలిపానని.. తన భద్రత పై పోలీసులు చూసుకుంటామని హామీ ఇచ్చారని అవంతి చెప్పారు. ‘మా మామ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి.. బెదిరింపు కాల్స్ ఆడియోలు పోలీసులకు అందజేశాము’ అని ఆమె పేర్కొంది. ‘హేమంత్ ను చంపతారు అని మేము ఊహించలేదు.. అందుకే చందానగర్ నుండి గచ్చిబౌలి వచ్చిన విషయం పోలీసులకు చెప్పలేదు’ అని అవంతి వాపోయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన అవంతి.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపింది.