ఈనెల 8న ఏపీలో రైతు దినోత్సవం

| Edited By: Srinu

Jul 06, 2019 | 7:47 PM

ఈనెల 8న రైతు దినోత్సవాన్ని సీఎం వైఎస్ జగన్ పులివెందులలో ప్రారంభించనున్నారని ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులకు భరోసా కల్పించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా రాష్ర్టంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం విత్తనాల కొరత ఏర్పడటానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు మంత్రి. గత ప్రభుత్వం విత్తనాల కోసం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల […]

ఈనెల 8న ఏపీలో రైతు దినోత్సవం
Follow us on

ఈనెల 8న రైతు దినోత్సవాన్ని సీఎం వైఎస్ జగన్ పులివెందులలో ప్రారంభించనున్నారని ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులకు భరోసా కల్పించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా రాష్ర్టంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం విత్తనాల కొరత ఏర్పడటానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు మంత్రి. గత ప్రభుత్వం విత్తనాల కోసం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అనుకున్నంతగా కేటాయింపులు జరపలేదని విమర్శించారు మంత్రి కన్నబాబు.