ఏపీలో ఇసుక కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ విశేషాలు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక లభ్యతపై ఆన్లైన్లో వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలని రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. నదుల్లో వరద తగ్గిన వెంటనే ఓపెన్ రీచ్ల్లో ఇసుక తవ్వకాలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఏపీలో ఇసుక కార్పోరేషన్ ఏర్పాటుపై అమరావతి రాజధాని ప్రాంతం తాడేపల్లిలో ఆ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, […]
ఆంధ్రప్రదేశ్లో ఇసుక లభ్యతపై ఆన్లైన్లో వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలని రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. నదుల్లో వరద తగ్గిన వెంటనే ఓపెన్ రీచ్ల్లో ఇసుక తవ్వకాలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఏపీలో ఇసుక కార్పోరేషన్ ఏర్పాటుపై అమరావతి రాజధాని ప్రాంతం తాడేపల్లిలో ఆ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి అండ్ ఎండి హరినారాయణ్, డిఎంజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇసుక కార్పోరేషన్ విధివిధానాలపై చర్చించారు. వినియోగాదారులకు ఇసుకను పారదర్శకంగా, వేగంగా చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రస్తుతం వున్న ఇసుక పాలసీని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సాగింది. బ్లాక్ మార్కెట్లో ఇసుక విక్రయాలు జరగకుండా, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఇసుక రీచ్ల్లో కార్యకలాపాలను సమీక్షించాలని నిర్ణయించారు.