గత వారం రోజులుగా.. ఏపీ అసెంబ్లీ ఘాటు ఘాటు చర్చలతో కాస్త హాట్గానే నడుస్తోంది. మేము గొప్ప అంటే.. మేము గొప్ప అని ఇరు పక్షాలు అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ.. వీరి విమర్శలతోనే వారం రోజులు గడిచిపోయాయి. అయితే.. ఇన్ని జరుగుతున్నా.. మహిళలకు న్యాయం చేసే ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో 11 కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, మద్యంపై ఎక్కువగా చర్చ సాగే అవకాశం ఉంది. అంతేకాకుండా.. సీఎం జగన్ తీసుకొచ్చిన నవరత్న పథకాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. అయితే.. ఈ శీతాకాల సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే జరగనున్నాయని సమాచారం. మరి ఈ బిల్లులు ఇప్పుడు గనుక ఈ బిల్లులు పాస్ అవ్వకపోతే.. మళ్లీ వచ్చే ఏడాది వరకూ బడ్జెట్ సమావేశాల వరకూ వేచి చూడక తప్పదు.
11 కీలక బిల్లులు: