AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 538 కరోనా పాజిటివ్ కేసులు.. చిత్తూరు, కృష్ణా జిల్లాలలోనే అత్యధికం
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా... 538 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,73,995కు చేరింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా… 538 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,73,995కు చేరింది. కరోనా కారణంగా కొత్తగా ఇద్దరు మరణించినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 7,047కు చేరింది. తాజాగా 558 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 8,61,711 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,237 యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,06,35,197 కరోనా టెస్టులు చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 95, కృష్ణలో 86, పశ్చిమగోదావరిలో 72, గుంటూరులో 72 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 50 కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో యాభై లోపు కేసులు నమోదయ్యాయి.
Also Read :
హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పున:ప్రారంభం, తాగి వాహనం నడిపితే బ్యాండ్ బాజానే
కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?
తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు..హైదరాబాద్లో హోమ్ డెలివరీ సేవలు ప్రారంభం