తాలిబన్లపై ఉక్కుపాదం.. జబుల్ ప్రావిన్స్‌లో 24 మంది ఉగ్రవాదుల హతం..

ఆఫ్ఘనిస్థాన్‌లో సైన్యానికి, తాలిబన్లకు మధ్య వార్ తీవ్రతరమవుతోంది. నిత్యం ఎదో ఓ ప్రాంతంలో ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు దాడులకు దిగడం.. ఆ తర్వాత ఆఫ్ఘన్ సైన్యం, నాటో దళాలు, ఫారిన్ ఫోర్స్‌ల..

తాలిబన్లపై ఉక్కుపాదం.. జబుల్ ప్రావిన్స్‌లో 24 మంది ఉగ్రవాదుల హతం..
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 6:43 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో సైన్యానికి, తాలిబన్లకు మధ్య వార్ తీవ్రతరమవుతోంది. నిత్యం ఎదో ఓ ప్రాంతంలో ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు దాడులకు దిగడం.. ఆ తర్వాత ఆఫ్ఘన్ సైన్యం, నాటో దళాలు, ఫారిన్ ఫోర్స్‌ల సహాయంతో తాలిబన్లను టార్గెట్‌ చేస్తూ దాడులకు దిగడం నిత్య కృత్యం అవుతోంది. తాజాగా జబుల్ ప్రావిన్స్‌లో ఆఫ్ఘన్‌ సైన్యానికి, తాలిబన్లకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో.. 24 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. జబుల్ ప్రావిన్స్‌లోని అర్ఢన్‌బాద్,శింక్‌జయ్, షా జోయి జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణల్లో మొత్తం 24 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారని డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించారు.