బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్లో ఛాన్స్ కొట్టేసిన మహేశ్ భామ.. ఆ సినిమాలో కీలక పాత్రలో..
టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన 'భారత్ అనే నేను' సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ
Heroine Kiara Advani: టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన ‘భారత్ అనే నేను’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ…ఈ అమ్మడుకి మాత్రం తెలుగులో ఆశించినంతగా అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్లో షాహిద్ సరసన నటించింది కియారా. అక్కడ కూడా ఆ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భారీ ఆఫర్ దక్కించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
డైరెక్టర్ సందీప్ వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో బాలీవుడ్లో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సందీప్ వంగా.. రణబీర్ కపూర్తో ఓ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ నటులు అనీల్ కపూర్, రణబీర్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి యానిమల్ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కియారా నటించనుందట. ఇందులో కియారా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా పరిణితి చోప్రా నటిస్తుంది. ఇక ఈ భారీ మల్టీస్టారర్ సినిమపై అభిమానల అంచనాలు భారీగానే ఉన్నాయి.
Also Read: