బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్‏లో ఛాన్స్ కొట్టేసిన మహేశ్ భామ.. ఆ సినిమాలో కీలక పాత్రలో..

టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన 'భారత్ అనే నేను' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ

బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్‏లో ఛాన్స్ కొట్టేసిన మహేశ్ భామ.. ఆ సినిమాలో కీలక పాత్రలో..
అయితే  తెలుగులో  లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాలతోనే  తో కియారా మరో సినిమా చేస్తుందని తెలుస్తుంది. 
Follow us

|

Updated on: Feb 01, 2021 | 3:35 PM

Heroine Kiara Advani: టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన ‘భారత్ అనే నేను’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ…ఈ అమ్మడుకి మాత్రం తెలుగులో ఆశించినంతగా అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‏లో షాహిద్ సరసన నటించింది కియారా. అక్కడ కూడా ఆ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భారీ ఆఫర్‏ దక్కించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

డైరెక్టర్ సందీప్ వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో బాలీవుడ్‏లో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సందీప్ వంగా.. రణబీర్ కపూర్‏తో ఓ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ నటులు అనీల్ కపూర్, రణబీర్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి యానిమల్ అనే టైటిల్‏ను కూడా ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో గెస్ట్ రోల్‏లో కియారా నటించనుందట. ఇందులో కియారా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‏గా పరిణితి చోప్రా నటిస్తుంది. ఇక ఈ భారీ మల్టీస్టారర్ సినిమపై అభిమానల అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read:

Hrithik Roshan: నైట్ మేనేజర్‌గా హృతిక్ రోషన్.. బ్రిటిష్ స్పై డ్రామా సిరీస్.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం..