కరోనా క్వారంటైన్ ‘లెక్క’ పెరుగుతోందట.. కేరళ డాక్టర్ల వెల్లడి
కేరళ డాక్టర్లు ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు. కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినవారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలన్నది నియమం. అయితే దీనికి 14 రోజులే కాదని, దీనికి రెట్టింపు.
కేరళ డాక్టర్లు ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు. కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినవారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలన్నది నియమం. అయితే దీనికి 14 రోజులే కాదని, దీనికి రెట్టింపు.. అంటే 28 రోజులు క్వారంటైన్ అవసరమయ్యేట్టు కనిపిస్తోందని ఈ డాక్టర్లు అంటున్నారు. ఉదాహరణకు దుబాయ్ నుంచి కన్నూర్ జిల్లాకు చేరుకున్న ఓ వ్యక్తికి ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడలేదని, కానీ ఈ నెల 14 న టెస్ట్ చేస్తే ‘అసలు విషయం’ బయటపడిందని ఓ డాక్టర్ తెలిపారు. 14 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్నా అవి తగ్గకపోవడంతో.. ఇంట్లోనే మరో 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామన్నారు. అంటే మొత్తం 28 రోజులయ్యాయి. ట్రావెల్ హిస్టరీ కారణంగా ఈ వ్యక్తికి ఇన్ని రోజుల సమయం అవసరమైందన్నారు. ఇలాగే హైరిస్క్ కేటగిరీలోనివారికి ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడకున్నా..తప్పనిసరిగా ఇన్ని రోజులూ స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలన్నది ఆ డాక్టర్ అభిప్రాయంగా కనిపిస్తోంది. దుబాయ్ నుంచి తిరిగి వఛ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా వైద్యులు 28 రోజుల సెల్ఫ్ ఐసోలేషన్ సూచించారు.
14 రోజుల క్వారంటైన్ తరువాత కూడా ఆరోగ్యంగా.. ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడని వ్యక్తులు తమకు తెలియకుండానే ఈ వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారన్న ఆందోళనను ఈ డాక్టర్ వ్యక్తం చేశారు. అయితే దేశంలోని ఇతర కేసుల విషయం నార్మల్ గానే ఉందని ఆయన పేర్కొన్నారు.