అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. ఓ వైపు వర్షం.. మరో వైపు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఇప్పుడు అకాల వర్షం నిండా ముంచింది. మంగళవారం మిట్ట మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా బలమైన ఈదురుగాలులతో వర్షం పెను బీభత్సం సృష్టించింది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే.. తీసుకొచ్చిన వడ్లను సకాలంలో కొనకపోవడం, ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతో ఎక్కడికక్కడ తడిసిపోయింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. ఓ వైపు వర్షం.. మరో వైపు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఇప్పుడు అకాల వర్షం నిండా ముంచింది. మంగళవారం మిట్ట మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా బలమైన ఈదురుగాలులతో వర్షం పెను బీభత్సం సృష్టించింది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే.. తీసుకొచ్చిన వడ్లను సకాలంలో కొనకపోవడం, ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతో ఎక్కడికక్కడ తడిసిపోయింది. వారం, పది రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబోస్తూ కాపాడుకున్న రైతులు, నిన్న కురిసిన భారీ వర్షం నుంచి రక్షించుకునేందుకు నానా ఇబ్బందులూ పడ్డారు. అయినా కళ్ల ముందే ధాన్యం తడిసిపోయి, కొట్టుకుపోతుంటే అన్నదాత కుదేలయ్యాడు.
కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వెంట వెంటనే తూకం వేయకపోవడం వల్లే నష్టం జరిగిందని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. కొన్ని మండలాల్లో భారీ చెట్లు రోడ్డుపైన విరిగి పడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గాలిదుమారంతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో చాలా గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కోనరావుపేట మండలం వట్టిమల్లలో పిడుగుపాటుకు రైతు దాదె జలపతికి చెందిన గేదె చనిపోయింది.
గాలిదుమారంతో పలు గ్రామాల్లో మామిడి తోటల్లోని కాయలు రాలి కిందపడ్డాయి. దీంతో రైతులకు భారీగా నష్టం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పక్షం రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిన జనానికి చల్లబడ్డ వాతావరణం ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ నెల వ్యవధిలో రెండు సార్లు అకాల వర్షాలు ఈదురుగాలులు, వడగళ్ల దెబ్బతో పంట పొలంలో ఉన్న వరి చేనులో గింజలన్నీ నేలపాలయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ఏ రైతును కదిలించినా కన్నీళ్ళే వస్తున్నాయి. వరుస అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని రైతులు బోరుమంటున్నారు. కళ్లెదుటే చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.
వరి పంటలు, మామిడి..
ఐకెపిలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు చేయాలని, నష్టం వాటిల్లిన మామిడి తోటలకు నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు.