“టీవీ9 నవ నక్షత్ర” సన్మానం ముఖ్య ఉద్దేశం ఇదే.. మై హోం గ్రూప్ చైర్మన్
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో విశేష కృషి చేసి సమాజ ప్రగతికి దోహదపడిన వారిని గౌరవంగా సన్మానించడమే “టీవీ9 నవ నక్షత్ర” కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు. వినూత్న రీతిలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రావడం మా అందర్నీ వెన్నుదంటి ప్రోత్సహించినట్లుందన్నారు. సమాకాలిన ప్రపంచం గురించి అపరిమిత విషయ పరిజ్క్షానం, స్పష్టమైన ఆలోచనా సరళి, నిర్ణయాత్మక వైఖరి కల్గిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా […]
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో విశేష కృషి చేసి సమాజ ప్రగతికి దోహదపడిన వారిని గౌరవంగా సన్మానించడమే “టీవీ9 నవ నక్షత్ర” కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు. వినూత్న రీతిలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రావడం మా అందర్నీ వెన్నుదంటి ప్రోత్సహించినట్లుందన్నారు. సమాకాలిన ప్రపంచం గురించి అపరిమిత విషయ పరిజ్క్షానం, స్పష్టమైన ఆలోచనా సరళి, నిర్ణయాత్మక వైఖరి కల్గిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల మన తెలుగు సమాజం అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే విషయంలో ఆయన కృషి పట్టుదలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
టీవీ9 న్యూస్ నెట్వర్క్ మై హోం, మెగా ఇంజనీరింగ్ సంస్థల యాజమాన్యం చేతిలోకి వచ్చాక… టీవీ9 నిర్మాణంలో పలు గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో న్యూస్ ఛానెల్ నిర్వహిస్తున్న సంస్థ.. నేడు జాతీయ స్థాయిలో.. నంబర్.1 న్యూస్ ఛానెల్ నెట్వర్క్గా అవతరించిందన్నారు. టీవీ9 నెట్ వర్క్ పరిధిని.. మరింతగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టీవీ9 ఛానెల్స్ ద్వారా.. వార్తలు, విశ్లేషణ, ప్రసారంలో నాణ్యత మరింత పెంచడంతో పాటు.. ఫోర్త్ ఎస్టేట్గా మీడియాకు ఉన్న బాధ్యతను గుర్తుంచుకొని.. నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించేందుకు టీవీ9 నెట్వర్క్ కట్టుబడి ఉందని రామేశ్వర్ రావు అన్నారు.