నేడు హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనకు తొలగించిన భద్రతను పునరుద్దరించాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. జగన్ ప్రభుత్వం తనకు భద్రత కుదించిందని తిరిగి పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు భద్రత కుదించలేదని ఏపీ ప్రభుత్వం, డీజీపీ గౌతం సవాంగ్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు నిబంధనలకు మించి సెక్యూరిటీ ఇస్తున్నట్లు వారు తెలిపారు. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని ప్రభుత్వం వివరించింది. చంద్రబాబుకు నిబంధనల […]
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనకు తొలగించిన భద్రతను పునరుద్దరించాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. జగన్ ప్రభుత్వం తనకు భద్రత కుదించిందని తిరిగి పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబుకు భద్రత కుదించలేదని ఏపీ ప్రభుత్వం, డీజీపీ గౌతం సవాంగ్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు నిబంధనలకు మించి సెక్యూరిటీ ఇస్తున్నట్లు వారు తెలిపారు. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని ప్రభుత్వం వివరించింది. చంద్రబాబుకు నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భద్రతను కుదించామంటూ టీడీపీ గగ్గోలు పెట్టడం సరికాదని వైసీపీ నేతలు చెబుతున్నారు.