భారత్ వర్సెస్ సౌతాఫ్రికా : తొలి టీ20 వర్షార్పణం
భారత్ – సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ- ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఆగిపోయింది. ధర్మశాల స్టేడియం మొత్తం వాన నీరు నిలిచి ఉండడం వల్ల రిఫరీ మ్యాచ్ రద్దు చేశారు. కనీసం టాస్ వేసేందుకు కూడా వీలు పడలేదు.ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచింది సిబ్బంది. మధ్యలో కొంత సేపు వర్షం ఆగినప్పటికీ ఆ తర్వాత […]
భారత్ – సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ- ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఆగిపోయింది. ధర్మశాల స్టేడియం మొత్తం వాన నీరు నిలిచి ఉండడం వల్ల రిఫరీ మ్యాచ్ రద్దు చేశారు. కనీసం టాస్ వేసేందుకు కూడా వీలు పడలేదు.ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచింది సిబ్బంది. మధ్యలో కొంత సేపు వర్షం ఆగినప్పటికీ ఆ తర్వాత వస్తూ, పోతూ ఉంది. దీంతో ఆరు నెలల తర్వాత అభిమానుల మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకున్న టీమ్ ఇండియా కల, ప్రపంచకప్ చేదు అనుభవాన్ని ఈ మ్యాచ్తో చెరిపేసుకోవాలనుకున్న దక్షిణాఫ్రికా ఆశకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం మొహాలిలో రెండో మ్యాచ్ జరగనుంది.
Things not looking great here in Dharamsala at the moment. It is pouring ⛈️⛈️? #TeamIndia #INDvSA pic.twitter.com/azf8NDMVTV
— BCCI (@BCCI) September 15, 2019