పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌

రాజస్థాన్ : భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్‌ ను బీఎస్‌ఎఫ్‌ పేల్చేసింది. శనివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్‌ సమీపంలోని హిందూమల్‌కోట్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఓ డ్రోన్ ప్రవేశించింది. డ్రోన్ రాకను పసిగట్టిన భారత భద్రతా దళాలు వెంటనే డ్రోన్ ను పేల్చేశాయి. కాగా బాలాకోట్ దాడి అనంతరం.. సరిహద్దులోని భారత భూభాగంలో పరిస్థితిని తెలుసుకునేందుకు పాక్ డ్రోన్లను పంపిస్తోందని సైన్యం అనుమానిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ దాడుల తర్వాత […]

పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 4:49 PM

రాజస్థాన్ : భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్‌ ను బీఎస్‌ఎఫ్‌ పేల్చేసింది. శనివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్‌ సమీపంలోని హిందూమల్‌కోట్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఓ డ్రోన్ ప్రవేశించింది. డ్రోన్ రాకను పసిగట్టిన భారత భద్రతా దళాలు వెంటనే డ్రోన్ ను పేల్చేశాయి. కాగా బాలాకోట్ దాడి అనంతరం.. సరిహద్దులోని భారత భూభాగంలో పరిస్థితిని తెలుసుకునేందుకు పాక్ డ్రోన్లను పంపిస్తోందని సైన్యం అనుమానిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ దాడుల తర్వాత పాక్ డ్రోన్ ఒకటి గుజరాత్‌లోని కచ్ సరిహద్దు వెంబడి ఉన్న నలియా స్థావరం సమీపంలోకి ప్రవేశించగా సైన్యం దాన్ని కూల్చివేసింది. మార్చి 4న కూడా రాజస్థాన్‌లోని బికనీర్ సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించగా భద్రతా బలగాలు సుఖోయ్-30 యుద్ధ విమానంతో కూల్చివేశాయి. ఇప్పుడు ఇది మూడో డ్రోన్ అని అధికారులు తెలిపారు.