తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో శనివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటుగా మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌ఘడ్, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోనూ గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ […]

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..
Rain Alert
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 12:06 PM

తెలుగు రాష్ట్రాల్లో శనివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటుగా మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌ఘడ్, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోనూ గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది.