డాలర్ బాయ్ ఒత్తిడితోనే ప్రదీప్‌, కృష్ణుడి పేర్లు చెప్పా: బాధితురాలు

139 మంది తనపై అత్యాచారం చేశారంటూ ఇటీవల ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన చేసిన విషయం తెలిసిందే.

డాలర్ బాయ్ ఒత్తిడితోనే ప్రదీప్‌, కృష్ణుడి పేర్లు చెప్పా: బాధితురాలు
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 1:47 PM

Hyderabad molestation case: 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ ఇటీవల ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 139 మందిపై పంజాగుట్ట పోలీసులు నిర్భయ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఈ కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా దీనిపై మాట్లాడిన బాధితురాలు పలు కీలక విషయాలు వెల్లడించారు. డాలర్ బాయ్ ఒత్తిడితోనే కొందరి పేర్లు అందులో పెట్టాల్సి వచ్చిందని ఆమె అన్నారు. కొంత మందితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా అనవసరంగా డాలర్ బాయ్ వారి పేర్లు పెట్టించాడని.. అలా పెట్టకపోతే ఫ్యామిలీ చంపేస్తానని బెదిరించాడని ఆమె తెలిపారు.

నాపై లైంగిక దాడి జరిగిన మాట నిజమే. కానీ అందులో సెలబ్రిటీలు లేదు. బయట 50 శాతం వేధింపులకు గురైతే.. మరో 50 శాతం డాలర్ బాయ్ వేధించాడు. నా వల్ల ఇబ్బంది పడ్డ వారికి క్షమాపణలు చెబుతున్నా. నాలా ఇంకో అమ్మాయికి అన్యాయం జరగకూడదు. నాలా మరో ఇద్దరిని డాలర్ బాయ్ ట్రాప్ చేశారు అని బాధితురాలు వెల్లడించారు. అయితే మరోవైపు ఈ డాలర్ బాయ్ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టారు. అతడు ఎవరు..? ఎందుకు అమ్మాయిలను ట్రాప్ చేశాడు..? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Read More:

‘బిగ్‌బాస్‌’కి మరో షాక్‌.. రఘు మాస్టర్ అవుట్‌!

రియాకు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు.. నెటిజన్లు ఫైర్‌