Vastu Tips: మీ వంటిట్లో వస్తువులు సరైన దిశలో ఉన్నాయా.? వాస్తు ఏం చెబుతోంది..
మరి వంట గదిలో ఉండే వస్తువుల విషయంలో వాస్తు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో వంట గదికి ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయించేది తీసుకునే ఆహారమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వంటింట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వంటింట్లో వస్తువులు ఏ దిశలో ఉంటే మంచిదంటే..
![Vastu Tips: మీ వంటిట్లో వస్తువులు సరైన దిశలో ఉన్నాయా.? వాస్తు ఏం చెబుతోంది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/kitchen-vastu.jpg?w=1280)
ఇంటి నిర్మాణంలో వాస్తు ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వాస్తు అనగానే కేవలం మనం నిర్మాణం వరకు మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ప్రతీ గదిలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలన్న వివరాలను వాస్తు శాస్త్రంలో సవివరంగా తెలిపారు.
మరి వంట గదిలో ఉండే వస్తువుల విషయంలో వాస్తు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో వంట గదికి ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయించేది తీసుకునే ఆహారమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వంటింట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వంటింట్లో వస్తువులు ఏ దిశలో ఉంటే మంచిదంటే..
* వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో బియ్యం ప్రాధానమైంది. అందుకే బియ్యం ఏర్పాటు చేసుకునే దిశ విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. బియ్యం డబ్బాను నైరుతి లేదా ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇక వంట గదిలో ఉపయోగించే ఎలక్ట్రిక్ పరికరాల విషయంలో కూడా నియమాలు పాటించాలి. ముఖ్యంగా మైక్రోవేవ్, మిక్సీలు, గ్రైండర్, టోస్టర్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఆగ్నేయ దిశలో ఉండాలిఆ. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగకుండా ఉంటుంది.
* వంటింట్లో ఉండే గ్యాస్ స్టైల్ తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. వంట చేసే వ్యక్తి తూర్పు ముఖంగా నిలబడి ఉండేలా చూసుకోవాలి.
* ఇక వాష్ బెషెన్ను కిచెన్లోని ఈశాన్యం మూలలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.
* వంంట చేసిన తర్వాత వంటకాలను వీలైనంత వరకు దక్షిణం దిశలో ఉండేలా చూసుకోవాలి.
ఇవి కూడా..
ఇక కేవలం వాస్తు మాత్రమే కాకుండా వంటింట్లో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వంటింట్లో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలని చెబుతున్నారు. కిచెన్లో ఉప్పు, పసుపు, బియ్యం, పిండి అయిపోకుండా జాగ్రత్త పడాలి. ఇవి పూర్తిగా ఖాళీ కాకముందే తెచ్చిపెట్టుకోవాలి. పసుపు కూడా నిండుకోకుండా చూసుకోవాలి. పసుపు లోటు ఉంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇక ఉప్పు కూడా ఇంట్లో ఎప్పుడూ ఉండాలి. పక్కింటి వాళ్ల నుంచి ఉప్పను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్ట్ కథనాల కోసం క్లిక్ చేయండి..