స్థంభానికి తగిలిన యువతి.. క్షణాల్లో..

గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. సూరత్‌ పట్టణంలో శుక్రవారం ఓ యువతి విద్యుత్‌ ఘాతకంతో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని బురదమయమయ్యాయి. అయితే ఈ సమయంలో ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. ఓ మూల మలుపు వద్ద ఉన్న కరెంట్ పోల్‌ను పట్టుకుంది. అంతే.. క్షణాల్లో ఆమె తన ప్రాణాలు కోల్పోయింది. ఆ విద్యుత్ స్థంభానికి కరెంట్ సరఫరా అవుతుండటంతో.. ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అధికారుల […]

స్థంభానికి తగిలిన యువతి.. క్షణాల్లో..
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 8:03 PM

గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. సూరత్‌ పట్టణంలో శుక్రవారం ఓ యువతి విద్యుత్‌ ఘాతకంతో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని బురదమయమయ్యాయి. అయితే ఈ సమయంలో ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. ఓ మూల మలుపు వద్ద ఉన్న కరెంట్ పోల్‌ను పట్టుకుంది. అంతే.. క్షణాల్లో ఆమె తన ప్రాణాలు కోల్పోయింది. ఆ విద్యుత్ స్థంభానికి కరెంట్ సరఫరా అవుతుండటంతో.. ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన అంతా అక్కడే ఉన్న ఓ సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది.