జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్స్ : గచ్చిబౌలి డివిజన్ లో వచ్చిన మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్ట్

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంమైంది. పోస్టల్ ఓట్ల కౌంటింగ్‌ తర్వాత ప్రాథమిక లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్స్ : గచ్చిబౌలి డివిజన్ లో వచ్చిన మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్ట్
Follow us

|

Updated on: Dec 04, 2020 | 8:48 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంమైంది. పోస్టల్ ఓట్ల కౌంటింగ్‌ తర్వాత ప్రాథమిక లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటగా మెహదీపట్నం డివిజన్‌, చివరగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ఫలితాలు వెలువడనున్నాయి. కాగా గచ్చిబౌలి డివిజన్(105) లో వచ్చిన మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్ట్ అవ్వగా ఒకటి తెరాస అభ్యర్థి సాయి బాబాకు వచ్చింది. ఇక కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు.