Breaking : ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వద్ద ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి కాకినాడకు హీరో ద్విచక్రవాహనాలతో వెళ్తున్న కంటైనర్కు హైటెన్షన్ కరెంట్ తగిలాయి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వద్ద ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి కాకినాడకు హీరో ద్విచక్రవాహనాలతో వెళ్తున్న కంటైనర్కు హైటెన్షన్ కరెంట్ తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి..సెకన్ల వ్యవధిలో కంటైనర్ మొత్తం మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వచ్చి ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
Also Read : Bigg Boss Telugu 4 Winner : అభి’జీత్’ను గెలిపించిన అంశాలు ఇవే..వచ్చాడు..నిలిచాడు.. గెలిచాడు