ఖమ్మం జిల్లాలో పాత నోట్ల డంప్ పట్టివేత!

ఖమ్మం జిల్లా, వేంసూరు మండలంలోని మర్లపాడులో ఈరోజు ఒకఇంట్లో పోలీసుల తనిఖీల్లో 12, 50, 500, 1000 రూపాయల పాత నోట్లను సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.  ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో గత కొద్దిరోజుల క్రితం మదార్ అతని అనుచరుల వద్ద సుమారు 7 కోట్ల నకిలీ నోట్లను ఖమ్మం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని […]

ఖమ్మం జిల్లాలో పాత నోట్ల డంప్ పట్టివేత!
Follow us

| Edited By:

Updated on: Nov 13, 2019 | 7:20 PM

ఖమ్మం జిల్లా, వేంసూరు మండలంలోని మర్లపాడులో ఈరోజు ఒకఇంట్లో పోలీసుల తనిఖీల్లో 12, 50, 500, 1000 రూపాయల పాత నోట్లను సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.  ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో గత కొద్దిరోజుల క్రితం మదార్ అతని అనుచరుల వద్ద సుమారు 7 కోట్ల నకిలీ నోట్లను ఖమ్మం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని సత్తుపల్లి ఏ. సి.పి వెంకటేష్ తెలిపారు.