పార్లమెంటరీ కమిటీ ముందుకు ఫేస్బుక్
సామాజిక మాధ్యమాల్లో వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ఆయా మాధ్యమాలు తీసుకుంటున్న చర్యలను తమకు తెలియజేయాలని పార్లమెంటరీ కమిటీ గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ జోయల్ కప్లాన్ మార్చి 6న కమిటీ ఎదుట హాజరు కానున్నారు. కమిటీ నోటీసులు పంపించిన వాటిలో వాట్సాప్, ఇన్స్టగ్రామ్, ట్విటర్ కూడా ఉన్నాయి. ఇప్పటికే కమిటీ ముందు ట్విటర్ ప్రతినిధులు హాజరయ్యారు. కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పలేకపోయారు. రాత పూర్వకంగా సమాధానమిచ్చేందుకు […]
సామాజిక మాధ్యమాల్లో వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ఆయా మాధ్యమాలు తీసుకుంటున్న చర్యలను తమకు తెలియజేయాలని పార్లమెంటరీ కమిటీ గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ జోయల్ కప్లాన్ మార్చి 6న కమిటీ ఎదుట హాజరు కానున్నారు. కమిటీ నోటీసులు పంపించిన వాటిలో వాట్సాప్, ఇన్స్టగ్రామ్, ట్విటర్ కూడా ఉన్నాయి. ఇప్పటికే కమిటీ ముందు ట్విటర్ ప్రతినిధులు హాజరయ్యారు. కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పలేకపోయారు. రాత పూర్వకంగా సమాధానమిచ్చేందుకు కమిటీ వారికి 10 రోజులు గడువిచ్చింది. పేస్బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ కమిటీ ముందుకు రావడం లేదు. బదులుగా ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ జోయల్ కప్లాన్ను పంపిస్తున్నారు. ఇండియాలో ఫేస్బుక్కు దాదాపు 300 మిలియన్లు, వాట్సాప్కు 200 మిలియన్లు, ఇన్స్టగ్రామ్కి 75 మిలియన్ల మంది వినియగదారులున్నట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికలు రానున్నందున ఫేస్బుక్లో పార్టీలు, రాజకీయ నాయకులు ఇచ్చే ప్రకటనల విషయంలో పారదర్శకతను పాటించేందుకు ఫేస్బుక్ ముందుకొచ్చింది. ప్రకటన ఎవరు ఇచ్చారు? ఎంత రుసుం చెల్లించారు? అనే విషయాలన్నీ ప్రకటన కింద తెలియజేయడానికి అంగీకరించింది.