రాహుల్ సిప్లిగంజ్.. సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ సింగర్. తెలంగాణ యాసలో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట్లో ప్రైవేట్ సాంగ్స్ ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్ ఆతర్వాత సినిమాల్లో పడే అవకాశం దక్కించుకున్నాడు. ఇక రాహుల్ పాడిన పాట ఏకంగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. దాంతో రాహుల్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కీరవాణి సంగీత సారథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ పాటను కాలభైరవతో కలిసి ఆలపించాడు రాహుల్. అంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు రాహుల్.
ఎన్టీఆర్ దమ్ము సినిమాలో దమ్ము, వాస్తు బాగుందే, రచ్చ సినిమాలో సింగరేణి ఉంది, ఛల్ మోహన రంగా సినిమాలో పెద్దపులి వంటి పాటలతో గుర్తింపు పొందాడు. 2018లో వచ్చిన రంగస్థలం సినిమాలో రాహుల్ పాడిన రంగ రంగ రంగస్థలానా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ తాను చేసిన తప్పు గురించి మాట్లాడాడు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
రాహుల్ మాట్లాడుతూ.. తాను సూపర్ స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని అని అన్నారు. ఒకరోజు రజినీకాంత్ ను కలిసే అవకాశం వచ్చిందని.. అయితే అప్పుడు రజినీకాంత్ అన్నాత్తే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఆయనను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ మూవీ లుక్ లో ఉన్నారు. నేను వెళ్లి అడగ్గానే ఆయన అదే గెటప్ లో నాతో ఫోటో దిగారు. అయితే అప్పటికి ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. కాబట్టి ఆ ఫోటోను ఎక్కడా పోస్ట్ చెయ్యొద్దు అని అన్నారు. నేను కూడా సరే అన్నాను. కానీ ఆతర్వాత కొద్దిరోజులకే నేను ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశా.. నేను చేసిన తప్పు అదే.. దానికి నేను ఇప్పటికీ బాధపడుతున్నా అని అన్నారు రాహుల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.