Tollywood: తెలుగులో కేవలం 2 సినిమాలు చేసి.. రూ.100 కోట్ల ఆస్తులు సంపాదించిన హీరోయిన్.. అక్కడ ఫాలోయింగ్ ఎక్కువే..

ఈ బ్యూటీ తెలుగులో చేసింది 2 సినిమాలే కానీ ఆమె ఆస్తులు మాత్రం రూ.100 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం బీటౌన్ లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ గ్లామర్ క్వీన్ ఆస్తి విలువ 100 కోట్లకు పైగానే ఉంది. అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..

Tollywood: తెలుగులో కేవలం 2 సినిమాలు చేసి.. రూ.100 కోట్ల ఆస్తులు సంపాదించిన హీరోయిన్.. అక్కడ ఫాలోయింగ్ ఎక్కువే..
Kriti Sanon
Follow us

|

Updated on: Jul 28, 2024 | 1:00 PM

సినీరంగుల ప్రపంచంలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. తెలుగు సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. అలాగే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ బ్యూటీ తెలుగులో చేసింది 2 సినిమాలే కానీ ఆమె ఆస్తులు మాత్రం రూ.100 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం బీటౌన్ లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ గ్లామర్ క్వీన్ ఆస్తి విలువ 100 కోట్లకు పైగానే ఉంది. అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ కృతి సనన్. దాదాపు పదేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు… కానీ కృతికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘ఆవ్ తుజో మోగ్ కోర్తా’ సినిమాతో యూత్‌లో క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అదే సంవత్సరం హీరోపంతి అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ కావడంతో నార్త్ లోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత అక్కినేని యువసామ్రాట్ నాగ చైతన్య సరసన దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ కావడంతో తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో ఈ హీరోయిన్ ముంబై షిఫ్ట్ అయ్యింది. హిందీ సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసిన ఈ హీరోయిన్.. హిట్స్ మీద హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా మారింది. దీంతో అగ్రకథానాయికగా మారింది.

ఇవి కూడా చదవండి

గ్లామర్ రోల్స్ కాకుండా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది. మూడేళ్ల క్రితం వచ్చిన ‘మిమీ’తో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఆ సినిమాలో సర్రోగేట్ మదర్ గా అద్భుతంగా నటించింది. హిందీలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న కృతి.. గతేడాది ప్రభాస్‌తో ఆదిపురుష్ చిత్రంలో నటించింది. ఈ ఏడాది ఈ బ్యూటీ ఇప్పటికే ‘తేరీ బథూన్ మేరీ ఐసా ఉల్జా జియా’, క్రూ అనే రెండు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం దూ పట్టి అనే సినిమా చేస్తుంది. అలాగే ఈమూవీని సొంత బ్యానర్ పై నిర్మిస్తుంది.

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.