ఎన్ని ఉన్నా ఆ సినిమానే నాకు చాలా స్పెషల్: రష్మిక

TV9 Telugu

27 July 2024

ఛలో, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.

 ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప 2 కూడా రానుంది.

పుష్ప-2 చిత్రం విడుదల కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు రష్మిక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన సరసన గీత గోవిందం, డియర్ కామ్రేడ్‌ చిత్రాల్లో నటించింది రష్మిక మందన్నా.

ఇందులో గీత గోవిందం  మూవీ వంద కోట్లు సాధిస్తే.. డియర్ కామ్రేడ్  సినిమా మాత్రం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపర్చింది.

కాగా ఈ సినిమా రిలీజై ఐదేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆ జ్ఞాపకాలు మరిచిపోలేనివని తెలిపింది రష్మిక. 

నేను ఇప్పటికే ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్పటికీ చాలా మంది నన్ను లిల్లీ అని పిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది.

ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైందని,ఈ మూవీని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది రష్మిక.