Josh Movie: జోష్ మూవీకి హీరోగా ఫస్ట్ ఛాయస్ నాగచైతన్య కాదట.. కటౌట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

దిల్ రాజు జోష్ సినిమాను మొదట రామ్ చరణ్‌తో తీయాలని అనుకున్నారు. చిరంజీవి సలహాతో ఆ ఆలోచన మారింది. తర్వాత నాగచైతన్య లాంచ్‌కు ఈ కథ సరిపోతుందని నాగార్జున అంగీకరించారు. సినిమా విడుదల సమయంలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. డిస్ట్రిబ్యూటర్లకు నష్టం రాకుండా దిల్ రాజు తన వంతు సహకారం అందించారు.

Josh Movie: జోష్ మూవీకి హీరోగా ఫస్ట్ ఛాయస్ నాగచైతన్య కాదట.. కటౌట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
Naga Chaitanya

Updated on: Mar 27, 2026 | 10:01 AM

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయితే, ఆయన నిర్మించిన జోష్ సినిమా వెనుక ఓ ఆసక్తికర విషయం చాలామందికి తెలియదు. ఈ సినిమాకు నాగ చైతన్య కంటే ముందు రామ్ చరణ్ మొదటి ఆప్షన్ అని ఆయన వెల్లడించారు. దిల్ రాజు అప్పటికే మున్నా చిత్రం షూటింగ్ జరుగుతుండగా, ఈక్వల్‌గా సుకుమార్ పరుగు కథను భాస్కర్‌తో చెప్పించారు. అల్లు అర్జున్ ఈ కథకు అరగంటలోనే ఓకే చెప్పడంతో పరుగు ఒక విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. అదే సమయంలో, కొత్త బంగారు లోకం సినిమాను కొత్త నటీనటులతో నిర్మించారు. అది కూడా భారీ విజయాన్ని అందుకుంది. కొత్త బంగారు లోకం విజయం తర్వాత, నాగ చైతన్యను లాంచ్ చేయడానికి నాగార్జునకి జోష్ కథను దిల్ రాజు చెప్పాలనుకున్నారు. కానీ, నాగ చైతన్య ఒక లెజెండరీ కుటుంబం నుంచి వస్తున్నందున, లాంచింగ్ సినిమా కొంచెం కమర్షియల్, హీరోయిక్‌గా ఉండాలని నాగార్జున అభిప్రాయపడ్డారు.

అయితే, దర్శకుడు వాసు వర్మ జోష్ కథను దిల్ రాజుకు చెప్పినప్పుడు, కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి కథలు చాలా కాలంగా రాలేదని, చాలా జెన్యూన్‌గా ఉందని దిల్ రాజుకు నచ్చింది. దాన్ని రామ్ చరణ్‌కు చెప్పమని వాసు వర్మకు సూచించారు. అప్పటికే రామ్ చరణ్ చిరుత పూర్తి చేసుకుని మగధీర నిర్మాణంలో ఉన్నారు. రామ్ చరణ్ కథ నచ్చి, చిరంజీవికి చెప్పమన్నారు. చిరంజీవి కథ విన్నాక కొంచెం ఆలోచించారు. మగధీర లాంటి భారీ సినిమా పక్కన జోష్ కథ అప్పటికి సరైంది కాదని చిరంజీవి భావించారు. నాగబాబు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో తన పాయింట్ కరెక్ట్ కాదని దిల్ రాజు సందేహించినా, కొత్త బంగారు లోకం సాధించిన విజయంతో ఆయనకు మరింత నమ్మకం కలిగింది. ఆ తర్వాత నాగ చైతన్య లాంచ్ కోసం నాగార్జునకి జోష్ కథను వినిపించారు. నాగార్జునకి ఆ కథలో శివ సినిమా రిఫ్లెక్షన్ కనిపించింది. స్టూడెంట్ లీడర్ పాత్ర ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. దిల్ రాజు సక్సెస్ గ్రాఫ్‌పై నమ్మకంతో నాగార్జున, నాగ చైతన్యను జోష్ సినిమాతో లాంచ్ చేయడానికి ఎస్.వి.సి.కి అప్పగించారు.

జోష్ విడుదల సమయంలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణం కారణంగా రాష్ట్రంలో అల్లకల్లోలం ఏర్పడటంతో, సినిమా విడుదల రెండు మూడు రోజులు వాయిదా పడింది. ఈ అంతరాయాల మధ్య విడుదలైన సినిమాకు మిశ్రమ ఫలితం వచ్చింది. అయితే, దిల్ రాజు తన డిస్ట్రిబ్యూటర్ల విషయంలో ఎప్పుడూ చాలా నిజాయితీగా ఉంటారు. సినిమా పెద్ద రేట్లకు అమ్మినా, ఎవరికీ నష్టం రాకూడదని నాగార్జునకి సూచించారు. డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వస్తే తాను భరోసా ఇస్తానని కూడా చెప్పారు. నాగార్జున వ్యాపారాన్ని వ్యాపారంగానే చూడమని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. దిల్ రాజు తన మొదటి సినిమా దిల్ నుంచే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా చూసుకోవడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. విజయంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా సంతోషంగా ఉండాలని తెలిపారు.

Follow Us