Prabhas: ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. రెగ్యూలర్ షూటింగ్ ఎప్పటినుంచంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. సాహో సినిమా తర్వాత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. సాహో సినిమా తర్వాత ప్రభాస్.. ఇప్పటివరకు స్క్రీన్ పై కనిపించకపోవడంతో.. ఆయన అభిమానులు… డార్లింగ్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే ఈ మూవీస్కు సంబంధించిన క్రేజీ అప్డేట్స్తో ఫ్యాన్స్ను ఖుషి చేస్తున్నాడు డార్లింగ్.. దక్షిణాది చిత్రపరిశ్రమలో కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇదే కాకుండా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రూపొందిస్తున్న మైథాలజీ మూవీ ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రాముడి పాత్రలో కనిపించనుండగా.. కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. వీటితోపాటు.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించనున్నారు. ఈమూవీ ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్తో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సినిమా గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ నవంబర్లో స్టార్ట్ చేయనున్నట్లుగా నిర్మాత అశ్వినిదత్ వెల్లడించారు. ఇందుకోసం ప్రభాస్ దాదాపు 200 రోజుల డేట్స్ కూడా కేటాయించారని ఆయన పేర్కోన్నారు. సంవత్సరంలోపే ఈ సినిమా పూర్తిచేస్తామని.. ఇక మొదటి షెడ్యూల్లోనే దీపికా కూడా పాల్గోంటుందని తెలిపారు. ఇక ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..