‘విరాట పర్వం’ మొదటి ఘట్టం పూర్తి!

|

Jul 02, 2019 | 2:45 AM

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం 1992’. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని ధరిపల్లి అనే గ్రామంలో ప్రారంభమైన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది. త్వరలోనే ఈ […]

విరాట పర్వం మొదటి ఘట్టం పూర్తి!
Follow us on

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం 1992’. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని ధరిపల్లి అనే గ్రామంలో ప్రారంభమైన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. టబు, ప్రియమణి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.