జ‌మ్మూక‌శ్మ‌ర్‌లో నేటితో ముగియనున్న ఎన్నిక‌ల పోలింగ్‌.. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలిసారిగా ఎన్నిక‌లు

జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ శనివారంతో ముగియనుంది.ఈ ఎన్నికల పోంగ్ నేడు చివరి విడత జరగనుంది. 28డీడీసీ నియోజకవర్గానికి జరిగే...

జ‌మ్మూక‌శ్మ‌ర్‌లో నేటితో ముగియనున్న ఎన్నిక‌ల పోలింగ్‌.. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలిసారిగా ఎన్నిక‌లు
Follow us

|

Updated on: Dec 19, 2020 | 8:51 AM

జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ శనివారంతో ముగియనుంది.ఈ ఎన్నికల పోంగ్ నేడు చివరి విడత జరగనుంది. 28డీడీసీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల బరిలో 168 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో అధికారులు 1,703 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ లో 6.30 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జమ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ పోలింగ్‌లో ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునే అవ‌కాశం ఉంది. క‌శ్మీర్ డీడీసీ ఎన్నిక‌ల‌ను మొత్తం ఎనిమిది విడ‌త‌ల్లో పోలింగ్ జ‌రుగుతోంది. నేటితో ఎన్నిక‌లు ముగియ‌నుండ‌గా, 22న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.