సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా.. భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించనున్న తెలుగమ్మాయి..

'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్‏గా పరిచయమయ్యింది వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆ మూవీ తర్వాత బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాల్లో

సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా.. భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించనున్న తెలుగమ్మాయి..
Follow us

|

Updated on: Feb 02, 2021 | 8:02 PM

‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‏గా పరిచయమయ్యింది వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆ మూవీ తర్వాత బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాల్లో నటించిన.. ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. ఆ తర్వాత హీరోయిన్‏గా కాకుండా కీలక పాత్రల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ సూపర్ ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.

పౌరాణిక ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తున్నా సంగతి తెలిసింది. మహాభారతంలోని ఆదిపర్వంలోగల దుష్యంతుడు, శాకుంతలం ప్రేమ కథ నేపథ్యంలో ఈ మూవీ రానుంది. అయితే ఇందులో శకుంతల పాత్రలో హీరోయిన్ సమంత నటించనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. ఇక దుష్యంతుడి పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా నటించనున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తెలుగమ్మాయి ఈషారెబ్బా నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొందర్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read:

Adipurush Movie: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..