మహారాష్ట్రలోని పాల్ఘర్ లో భూప్రకంపనలు
మహారాష్ట్రలోని పాల్ఘర్ లో మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 3.5 గా గుర్తించారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ లో మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 3.5 గా గుర్తించారు. నార్త్ ముంబైకి 104 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెలలో చాలాసార్లు ఈ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి, . ఇక నాసిక్ కూడా ఈ ప్రభావానికి గురయ్యింది. అటు-అస్సాంలోని బార్ పేట లో ఈ తెల్లవారుజామున ఒకటిన్నర గంటల సమయంలోనూ ఇలాంటి ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 4.2 గా గుర్తించారు.