ప్రభాస్ అభిమానులు… నిజంగా డైహార్డ్ ఫ్యాన్స్: సుజీత్
‘ఫ్యాన్స్ చాలా మందికి ఉంటారు. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్కు ఓపిక ఎక్కువ. అందుకే సినిమాలో ‘వారంతా డైహార్డ్ ఫ్యాన్స్’ అన్న డైలాగ్ రాశా అని చెప్పుకొచ్చారు దర్శకుడు సుజీత్. ‘సాహో’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బాహుబలి’ తర్వాత వెంటనే ప్రభాస్ నుంచి సినిమా రావాలని ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ, రెండేళ్లు ఎంతో ఓపికగా వేచి చూశారు. అందుకు ధన్యవాదాలు. నా ఒత్తిడులన్నీ నా ఫ్రెండ్స్కు, అమ్మానాన్నలకు ఇస్తా. అందుకే సెట్లో నేను ఎక్కువ ప్రశాంతంగా ఉంటా. […]
‘ఫ్యాన్స్ చాలా మందికి ఉంటారు. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్కు ఓపిక ఎక్కువ. అందుకే సినిమాలో ‘వారంతా డైహార్డ్ ఫ్యాన్స్’ అన్న డైలాగ్ రాశా అని చెప్పుకొచ్చారు దర్శకుడు సుజీత్. ‘సాహో’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బాహుబలి’ తర్వాత వెంటనే ప్రభాస్ నుంచి సినిమా రావాలని ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ, రెండేళ్లు ఎంతో ఓపికగా వేచి చూశారు. అందుకు ధన్యవాదాలు. నా ఒత్తిడులన్నీ నా ఫ్రెండ్స్కు, అమ్మానాన్నలకు ఇస్తా. అందుకే సెట్లో నేను ఎక్కువ ప్రశాంతంగా ఉంటా. షార్ట్ ఫిలింస్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చా. ఒక షార్ట్ ఫిలింకు సంబంధించిన డీవీడీని ప్రభాస్ అన్న చూసి, నన్ను పిలిపించారు. అప్పుడు నేను ‘మిర్చి’సినిమా చూస్తున్నా. ప్రభాస్ పిలుస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా. సరదాగా అన్నారేమోనని అప్పుడు వెళ్లలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు వెళ్తే, ‘ఏంటి.. డార్లింగ్ అప్పుడు పిలిస్తే రాలేదు’అన్నారు. ఆయన మైండ్ పెద్ద హార్డ్డిస్క్. నాలుగేళ్ల కిందట కూడా చెప్పినవి ఆయనకు గుర్తు ఉంటుంది. ట్రైలర్ చివరిలో ప్రభాస్ అన్న తలలో నుంచి రక్తం వస్తూ ఉండే సన్నివేశం ఉంటుంది. తొలుత ఈ షాట్ గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు కూడా ఆయన ఆ షాట్ను గుర్తు పెట్టుకున్నారు. నన్ను ఎంతో ప్రోత్సహించారు. అందరికి నా ధన్యవాదాలు’’ అనితెలిపారు. ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి: