కుష్మాండదుర్గ అలంకరణలో శ్రీ భ్రమరాంబాదేవి

శ్రీశైలంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు భ్రమరాంబాదేవి కుష్మాండదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. సాత్వికరూపంలో అమ్మవారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఎనిమిది చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల అమృత కలశంతో దర్శనమిచ్చింది. ఈ దేవిని పూజిస్తే సర్వరోగాలు తొలగిపోయి ఆరోగ్యం, ఆయువు, యశస్సు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉదయం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో వేదపండితులు కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, […]

కుష్మాండదుర్గ అలంకరణలో శ్రీ భ్రమరాంబాదేవి
Srisailam Devasthanam
Follow us

|

Updated on: Oct 21, 2020 | 1:38 AM

శ్రీశైలంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు భ్రమరాంబాదేవి కుష్మాండదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. సాత్వికరూపంలో అమ్మవారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఎనిమిది చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల అమృత కలశంతో దర్శనమిచ్చింది. ఈ దేవిని పూజిస్తే సర్వరోగాలు తొలగిపోయి ఆరోగ్యం, ఆయువు, యశస్సు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఉదయం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో వేదపండితులు కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాస వాహనాన్ని అధిరోహించిన శ్రీశైల మలన్న భక్తజనులను కటాక్షించారు. ఆలయ ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లు కైలాస వాహనంపై విహరించారు.