దేశ రాజధానిలో కరోనా విజృంభణ…గడిచిన 24 గంటల్లో 86 మంది మృతి..వణికిపోతున్న ఢిల్లీ జనం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 4,006 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,380కు చేరింది.

దేశ రాజధానిలో కరోనా విజృంభణ...గడిచిన 24 గంటల్లో 86 మంది మృతి..వణికిపోతున్న ఢిల్లీ జనం
Follow us

|

Updated on: Dec 01, 2020 | 6:52 PM

Delhi Covid-19 Reports: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 4,006 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,380కు చేరింది. ఇక 24 గంటల్లో 86 మంది మరణించగా.. మృతుల సంఖ్య 9,260కి చేరింది. అలాగే 5,036 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. కోలుకున్న వారి సంఖ్య 5,33,351కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 31,769 యాక్టివ్ కేసులు ఉన్నాయి. త్వరలోనే కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉండటం కరోనా వ్యాప్తికి కారణంగా మారుతోంది.