క్షణికావేశంలో భర్తను, అత్తమామలను చంపిన మహిళ
క్షణికావేశంలో ఓ మహిళ భర్తను, అత్తమామలను హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
క్షణికావేశంలో ఓ మహిళ భర్తను, అత్తమామలను హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..బెంగళూరు మైసూరు జిల్లా కేఆర్పేట హెమ్మడహళ్లికి చెందిన నాగమణి (45) అనే మహిళ చిన్న చిన్న విషయాలకే భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకునేది. ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం ఇంట్లో గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన నాగమణి కొబ్బరి తురిమే పీటతో అత్తమామలపై దాడి చేసింది. అడ్డుకోడానికి ప్రయత్నించిన భర్తపై కూడా గాయపరిచింది. తీవ్ర గాయాలపాలైన ముగ్గురినీ కేఆర్పేట గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నాగరాజు గత వారం ప్రాణాలు విడిచాడు. చావుబతుకులతో పోరాటం చేసిన ఆమె అత్తమామలు శనివారం రాత్రి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నాగమణి, నాగరాజు దంపతులకు 18, 20 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. నిందితురాలిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపారు. కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో పాటు పక్కింటి వాళ్లతో ఆమె తరచూ గొడవ పడేదని, ఊరిలోనే పెద్దలు పలుమార్లు రాజీ చేసినా, ఆమె తీరు మార్చుకోలేదని స్థానికులు తెలిపారు.
Also Read :